నాగర్ కర్నూల్ : జిల్లాలో ఎక్కడైనా బడి ఈడు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ హెచ్చరించారు. శుక్రవారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కార్మిక శాఖ, జిల్లా శిశు సంక్షేమ శాఖా ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బాల కార్మికులు ఉండటానికి వీలు లేదన్నారు.
ఎక్కడైనా హోటళ్ళు, వ్యాపార సంస్థలు, వ్యవసాయ పొలాలు, ఇంట్లో బానిసలుగా పని చేస్తుంటే స్పెషల్ ఆపరేషన్ ద్వారా గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై కటినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు తరచుగా ఆపరేషన్ ముష్కాన్, ఆపరేషన్ స్మైల్ తో పాటు లేబర్ ఆఫీసర్ ద్వారా జిల్లాలో పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు.
14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలను పనిలో చేర్చుకుంటే సెక్షన్ (3 ) పి అండ్ ఆర్ అమెండ్మెంట్ యాక్టు 2016 ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
14 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు పిల్లలను పనిలో పెట్టుకుంటే రూ. 50 వేల జరిమానా లేదా జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.
బాల కార్మికులు కనిపిస్తే టోల్ ఫ్రీ నెంబరు 1098 కు ఫోన్ చేసి తెలుపాలని కలెక్టర్ కోరారు.
కార్యక్రమంలో జిల్లా లేబర్ ఆఫీసర్ సాయి సుమన్, జిల్లా సంక్షేమ అధికారిని టి.యు. వెంకట లక్ష్మి, బాలల సంరక్షణ అధికారి ఇంతియాజ్, జిల్లా పౌర సంబంధాల అధికారి పి సీతారం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన : మంత్రి సబిత