జోగులాంబ గద్వాల : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయరాదని..ఎవరైనా ఈ చర్యకు పాల్పడితే వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మ హెచ్చరించారు. శనివారం కేటీ దొడ్డి మండలం పాతపాలెం, గంగన్ పల్లిలో ఏర్పాటుచేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ రెండు కొనుగోలు కేంద్రాలలో ఇక్కడి ప్రాంతం వారు కొంతమంది కర్ణాటకలో ధాన్యం కొనుగోలు చేసి ఇక్కడి కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తున్నారని ఫిర్యాదు వచ్చినందున అధికారులను అదనపు కలెక్టర్ అప్రమత్తం చేశారు. కర్ణాటక నుంచి ఇక్కడ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే వారిపై కేసులు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డి.టి, ఎస్ఐని ఆదేశించారు.
కర్ణాటక సరిహద్దులో మూడు చెక్ పాయింట్ల వద్ద మూడు బృందాలు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని ఆదేశించారు. తెలంగాణ ప్రాంత రైతాంగం లబ్ధి పొందడానికి ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుందని అదనపు కలెక్టర్ అన్నారు. అదనపు కలెక్టర్ వెంట కేటీదోడ్డి ఎస్ఐ కురుమయ్య, డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కొడుకు.. తట్టుకోలేక తండ్రి మృతి
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి