హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): జంతు సంరక్షణ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. జంతు రవాణా, వధపై జూన్ 26న కేంద్ర జంతు సంక్షేమ మండలి ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. బక్రీద్ పండుగ పేరిట ఆవులను వధించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొన్నది. ఆవులు, కోడెదూడలను అక్రమంగా రవాణా చేస్తున్నవారిపై వాట్సాప్ ద్వారా చేసిన ఫిర్యాదుపై షాద్నగర్ పోలీసులు చర్యలు తీసుకోలేదని గౌ గ్యాన్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ లక్ష్మణ్ మంగళవారం విచారణ జరిపారు. అక్రమంగా జంతువులను రవాణా చేసేవారిపై చట్ట ప్రకారం కేసులు నమోదుచేసి వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. వాట్సాప్ ద్వారా పిటిషనర్ చేసిన ఫిర్యా దు మేరకు ఎఫ్ఐఆర్ నమోదుచేసి నివేదిక సమర్పించాలని షాద్నగర్ పోలీసులకు స్పష్టంచేస్త్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 2కి వాయిదా వేశారు.