ఆదిలాబాద్ : లాక్ డౌన్ మూడో రోజు సందర్భంగా జిల్లా ఎస్పీ సీహెచ్.ప్రవీణ్ కుమార్ నిర్మల్ పట్టణంలో పర్యటించారు. పటిష్టమైన బందోబస్తు గురించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి.
రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎస్పీ వాహనాల తనిఖీ చేసి హెల్మెట్, సరైన ధృవపత్రాలు లేని వాహనాలపై తగు చర్యకు ఆదేశించారు. జిల్లాలో లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రాంరెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనుల పరిశీలన