జఫర్గఢ్, ఏప్రిల్8: మండలంలోని రఘునాథపల్లిలో శుక్రవారం నుంచి స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహించనున్నట్లు సర్పంచ్ బొమ్మినేని శ్రీదేవి గురువారం తెలిపారు. గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్నందున వార్డు సభ్యులు, గ్రామస్తులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామస్తుల వినతి మేరకు గ్రామంలో ఈ నెల 20వ తేదీ వరకు లాక్డౌన్ అమలు చేసేందుకు తీర్మానించినట్లు తెలిపారు. గ్రామం లో కరోనా బాధితుల సంఖ్య 28కి చేరిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, అత్యవసర పనులకు మాత్రమే బయటకు వెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, ఉప సర్పంచ్ రాజశేఖర్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ఎడ్ల రాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రైవేట్ టీచర్లకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్..2వేలు, 25కిలోల బియ్యం
కర్ణాటక సీఎం యడ్యూరప్పకు పదవీగండం: మే 2 తర్వాత మార్పు తప్పదా?