ఆదిలాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో లాక్డౌన్ను పరిశీలించారు. అమలు తీరు గురించి ఎస్పీ రాజేశ్చంద్రను అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ అమలు బాగుందని పేర్కొన్న మంత్రి.. ఇందుకు సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వెంట ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఉన్నారు.