జయశంకర్ భూపాలపల్లి : అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ కొండ గొర్రె పిల్లపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. దీన్ని గమనించిన స్థానికులు ఆ కుక్కల బారి నుంచి కొండ గొర్రె పిల్లను రక్షించారు. ఈ ఘటన భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఆ కొండ గొర్రె పిల్లను స్థానికులు దూదేకులపల్లి అటవీశాఖ రేంజర్ చంద్రమౌళికి అప్పగించారు.