పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలం గోపాల్పూర్ గ్రామంలోకి ఇవాళ ఉదయం అడవి దుప్పి ప్రవేశించింది. దీంతో వీధి కుక్కలు కలిసి దుప్పిపై దాడి చేశాయి. అప్రమత్తమైన గ్రామస్తులు వీధి కుక్కల నుంచి అడవి దుప్పిని కాపాడారు. కుక్కలను తరిమికొట్టి దుప్పిని పట్టుకున్నారు. గాయపడ్డ దుప్పిని అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు అప్పగించారు. వైద్యం కోసం పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించారు.