జైపూర్ : రాజస్థాన్ రాజధాని జైపూర్లో విషాదం నెలకొంది. అమేర్ ప్యాలెస్ వద్ద ఉన్న వాచ్ టవర్కు నిన్న పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో వాచ్ టవర్ వద్ద భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఆ టవర్ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు పర్యాటకులు ఎగబడ్డారు. ఆ సమయంలోనే భారీ పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే 11 మంది పర్యాటకులు మృతి చెందగా, మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు పక్కనున్న లోయలో పడిపోయారు. వారందరినీ రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.