బోథ్, మే 10: అనారోగ్యం, ప్రమాదాల బారినపడి దవాఖానలో ్లచికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థి కంగా భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్కొన్నారు. సొనాల గ్రామానికి చెందిన కొప్పెర్ల రాజశేఖర్కు రూ. 54వేలు, బాబెరకు చెందిన మహేశ్వరికి రూ.14వేలు, బోథ్కు చెందిన షేక్ అబ్దుల్ చంద్కు రూ.16 వేలు, మహ్మద్ ఇమ్రానొద్దీన్కు రూ.32 వేలు, మర్లపెల్లికి చెందిన దివ్యబాయికి రూ. 18వేలు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరయ్యాయి. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ రాథోడ్ లింబాజీ, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మణ్సింగ్ పాల్గొన్నారు.
తాంసి, మే 10: మండలంలోని పొన్నారి గ్రామానికి ఎర్రం స్వామి, కప్పర్లకు చెందిన కిషన్రావుకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అందజేశారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ ముచ్చ రేఖ రఘు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రమణ, తదితరులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, మే 10 : మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన పోతే మల్లు గంగుబాయికి రూ.12వేలు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరయ్యాయి. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు లబ్ధిదారుడికి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, పీఏసీఎస్ డైరెక్టర్ గంగాధర్, నాయకులు పాల్గొన్నారు.