కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో సోమవారం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన వసతులు కల్పించేలా అధికారులు కృషి చేయాలన్నారు. పరిశ్రమలు స్థాపిస్తే జిల్లా అభివృద్ధి పురోగమిస్తుందన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా ఇచ్చే ప్రోత్సాహకాలను ఔత్సాహికులకు తెలియజేయాలన్నారు.
ఇప్పటివరకు పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు సలహాలు సంబంధిత అధికారులకు అందజేశారు. టీ ప్రైడ్ పథకం కింద ఇప్పటి వరకు 8 మంది ఎస్సీలకు, 6 మంది ఎస్టీలకు 36 లక్షల రూపాయలు రాయితీకి సంబంధించిన మొత్తాన్ని మంజూరు చేసినట్లు వివరించారు. అలాగే పావలా వడ్డీ చొప్పున ఇద్దరికీ 47 వేల రూపాయలు మంజూరు చేశామన్నారు.
తిర్యాని మండలంలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పై ప్రత్యేక దృష్టి కేటాయించాలని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ విజయవంతానికి అధికారులు కలిసి పని చేయాలన్నారు. కార్యక్రమంలో డిఐసి జి.ఎం. రఘు, ఐపీఓ అశోక్, జిల్లా ఇన్చార్జి రవాణా శాఖ అధికారి కృష్ణయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ చెంచు రామయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రకు చెందిన రైతు కుటుంబానికి రైతు బీమా చెక్కు
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే