మంచిర్యాల : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో లాక్డౌన్ అమలు తీరును విప్ బాల్క సుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, అనవసరంగా ఎవరూ బయటకు రావద్దన్నారు. తప్పనిసరైతే తగిన జాగ్రత్తలతో రావాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, స్థానిక నాయకులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ల కొరత : మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర
అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం