అంబర్పేట, జూలై 6 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం బాగ్అంబర్పేట డివిజన్లోని పలు బస్తీలలో కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. వివిధ విభాగాల అధికారులను వెంటబెట్టుకొని గౌడసంఘం లేన్, కుమ్మరివాడ, భరత్నగర్, రెడ్బిల్డింగ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు ఉన్నా సమస్యలు తెలుసుకున్నారు. బస్తీల్లో జరుగుతున్న డ్రైనేజీ, పారిశుధ్య, రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం రామకృష్ణనగర్ పార్కులో జరిగిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. వీధి దీపాలు లేనిచోట వెంటనే వాటిని ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో డీసీ వేణుగోపాల్, ఏఎంవోహెచ్ హేమలత, ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఎలక్ట్రికల్ డీఈ ధర్మారెడ్డి, ఏఈ సౌమ్య, ఎంటమాలజి మేనేజర్ సత్య, వాటర్వర్క్స్ ఏఈ మాజిద్, హార్టికల్చర్ ఏఈ అంబిక, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అంబర్పేట ని యోజకవర్గంలో పట్టణ ప్రగతి కొనసాగుతున్నది. మంగళవారం నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట డివిజన్ల పరిధిలోని బస్తీలు, కాలనీల్లో పట్టణ ప్రగతి ము మ్మరంగా చేపట్టారు. సంబంధిత డివిజన్ల కార్పొరేట ర్లు, ఆయా డివిజన్ల నోడల్ అధికారులతో కలిసి వి విధ ప్రభుత్వ విభాగాల అధికారులు బస్తీల్లోని ఇంటింటి కీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృ షి చేస్తున్నారు. నల్లకుంట కార్పొరేటర్ వై.అమృత అధికారులతో కలిసి డివిజన్లోని బాయమ్మగల్లీ, బీరప్పగుడి, రైల్వేట్రాక్ లేన్, కమాన్గల్లీ ప్రాంతాల్లో తిరుగుతూ మట్టి, వ్యర్థాలను తొలగింపజేశారు. అదేవిధంగా అంబర్పేట కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్ డివిజన్లోని న్యూపటేల్ నగర్, చెన్నారెడ్డినగర్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఆయా బస్తీలలో తన దృష్టికి వచ్చిన డ్రైనేజీ, మంచినీటి సమస్య, వీధి దీపాలు, రోడ్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. గోల్నాకలో కార్పొరేటర్, అధికారులు తిరుగు తూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
కాచిగూడ, జూలై 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పట్టణ ప్రగతి’తో నగర రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని, ముఖ్యంగా హైదరాబాద్ కీర్తి మరింతగా పెరుగనుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. పదిరోజుల పాటు నిర్వహిస్తున్న ‘పట్టణ ప్రగతి’లో భాగంగా మంగళవారం కాచిగూడ డివిజన్లోని సూరజ్నగర్, మౌలానా ఆజాద్నగర్, రహమత్బాగ్ బస్తీకాలనీలలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవి ఉల్లాసంగా పాల్గొని డివిజన్లోని రోడ్లపై ఉన్న చెత్తాచెదారాన్ని ఊడ్చి, మట్టి కుప్పలను తొలగించి, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పచ్చదనం, పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. కార్యక్రమంలో సునీల్బిడ్లాన్, ఓం ప్రకాశ్యాదవ్, కన్నె రమేశ్యాదవ్, ఎర్రభీష్మా, బీమాగౌని కృష్ణాగౌడ్, సుభాశ్పటేల్, పట్లూరి సతీశ్, రమాదేవి, ఆర్.సంతోశ్, ఎం.నర్సింగ్రావు, మల్లికార్జున్, రమాదేవి, సూలం రవియాదవ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.