హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం సహా కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు, సిబ్బందిని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలు కఠినంగా అమలుచేయాలని పేర్కొన్నారు. శుక్రవారం డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని సీపీలు, ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సిబ్బందితో జోనల్ ఐజీలు, డీఐజీలతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. షాపింగ్ మాళ్లు, వైన్ షాప్లు, పబ్బులు, హోటళ్లు, రెస్టారెంట్లు, కిరాణ దుకాణాలు, పెట్రోల్బంకుల వంటి ప్రదేశాల్లో మాస్క్ తప్పక ధరించేలా అవగాహన కల్పించాలని, మాస్క్ లేని కస్టమర్లకు ఎవరూ సేవలు అందించవద్దని నిర్వాహకులకు సూచించాలని ఆదేశించారు.