మానకొండూర్ రూర ల్, సెప్టెంబర్ 20: కరీంనగర్ జిల్లా మా నకొండూర్ మండలం పచ్చునూర్ జడ్పీహెచ్ఎస్లో భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు బీ ఓదెలుకుమార్ ‘ఫెడ్ టీచర్ ఆఫ్ ద ఇయర్-2021’ అవార్డు అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ ద్వారా ఆయన ఈ అవార్డు స్వీకరించారు. 75వ స్వాతం త్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అకడమిక్ అచీవ్మెంట్ అవార్డ్స్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో రెండు తెలు గు రాష్ర్టాల నుంచి 12 మందిని ఎంపి క చేయగా అందులో కరీంనగర్ జిల్లా నుంచి ఓదెలు కుమార్ ఉన్నారు.