హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పేదరికంలో మగ్గుతున్న వీరభద్రీయ (వీరముష్టి) కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ కులసంఘం రాష్ట్ర కమిటీ నాయకులు బీసీ కమిషన్ను కోరారు. సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వీరభద్రీయ కులసంఘం రాష్ట్ర నాయకుడు విట్టపల్లి జగ్గయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రత్యేక పథకాల ద్వారా నిధులిచ్చి తమ కులస్థులను ఆదుకోవాలని కోరారు. సంఘం నేతలు చెవ్వ ఎల్లయ్య, మిట్టపల్లి లక్ష్మణ్, సురేందర్ తదితరులు బీసీ కమిషన్ చైర్మన్ను కలిసినవారిలో ఉన్నారు.