చేర్యాల/సిద్దిపేట : రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీవీ ప్రసాద్ ఆయన సొంత గ్రామమైన పాత దొమ్మాటను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ గ్రామ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఏజీ మంత్రి హరీశ్ రావుతో మాట్లాడడంతో వెంటనే మంత్రి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. ఏజీ వెంట జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, సిద్దిపేట, హుస్నాబాద్, ఆర్డీవోలు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.