హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్ 17: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి, మాందాడిపల్లిలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తో కలిసి అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ శుక్రవారం ఇంటిం టి ప్రచారం చేశారు. ఓటర్లను నేరుగా కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారికి గ్రామస్థులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. మహిళలు మం గళహారతులు పట్టి, తిలకం దిద్దారు.