యాదాద్రి, సెప్టెంబర్ 6: యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులు, నడవలేని స్థితిలో ఉన్న భక్తుల కోసం ఎస్కలేటర్ బిగింపు ప్రక్రియను సోమవారం వైటీడీఏ అధికారులు ప్రారంభించారు. కొండపైన క్యూ కాంప్లెక్స్లో మొదటి అంతస్తు నుంచి ప్రసాద విక్రయ భవనం వరకు ఎస్కలేటర్ల నిర్మించనున్నారు. ఒక్కో ఎస్కలేటర్ 35 ఫీట్ల పొడవు ఉంటుందని అధికారులు తెలిపారు.