హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా 2,418 మంది స్టాఫ్నర్సులు అందుబాటులోకి రానున్నారు. పెండింగ్లో ఉన్న స్టాఫ్నర్సు ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం రాత్రి వెల్లడించింది. మొత్తం 2,418 మందిని స్టాఫ్ట్నర్సులుగా ఎంపికచేస్తూ తుది ఫలితాలను ప్రకటించింది. మిగిలిన 893 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో పెండింగ్లో పెట్టారు. ఫలితాలు www.tspsc. gov.inలో అందుబాటులో ఉంచినట్టు
టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.