హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 337 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 181 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకోగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,455కు చేరాయి. ఇందులో 2,98,826 మంది కోలుకోగా, 1671 మంది మరణించారు. ప్రస్తుతం 2958 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 1226 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 37,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం కరోనా పరీక్షలు 96,50,662కు చేరాయి. కాగా, రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55 శాతం, రికవరీ రేటు 98.52 శాతంగా ఉన్నదని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.