హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఎస్సెస్సీ విద్యార్థులకు ఆగస్టులో ఒరిజినల్ మెమోలు అందనున్నాయి. అప్పటివరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన మెమోలను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవచ్చని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. నకిలీ, బోగస్ మెమోలను అరికట్టడంలో భాగంగా బార్కోడ్తోపాటు మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్లను ముద్రిస్తున్నారు. కొన్ని కారణాలతో ఎస్సెస్సీ మెమోల్లో పేర్లు, ఇంటిపేరు, తల్లిదండ్రుల పేర్లల్లో అక్షరదోషాలు, ఇతర్రాత తప్పులు చోటుచేసుకొంటున్నాయి. ఒకసారి ముద్రించి ఇచ్చిన మెమోల్లో తప్పులు దొర్లితే మళ్లీ ముద్రించి ఇవ్వడం సమస్యలతో కూడుకున్నది. అందుకే ఆలస్యమైనా తప్పులు లేకుండా మెమోలు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆగస్టు మొదటివారంలో మెమోలు అందజేస్తామని అధికారులు చెప్తున్నారు. స్కూల్ లాగిన్ ఐడీనుంచి ప్రింట్తీసి.. ప్రధానోపాధ్యాయులు సంతకం చేసిన మెమోలను ప్రస్తుతానికి వినియోగించుకోవచ్చని అంటున్నారు.