మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు?

హైదరాబాద్ : రాష్ర్ట వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా? అనే అంశంపై విద్యార్థుల్లో సందేహం ఉంది. అయితే మే 17వ తేదీ నుంచి పది పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించి, ఆ మరుసటి రోజు నుంచి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. ఈ ఏడాది 70 శాతం సిలబస్తోనే పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆరు సబ్జెక్టులకు ఆరు పరీక్షలే..
గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈసారి కేవలం ఆరు సబ్జెక్టులకు ఆరు పరీక్షలు నిర్వహించనున్నారు. నాలుగు ఎఫ్ఏ(ఫార్మెటివ్ అసెస్మెంట్) టెస్టులకు గానూ రెండు ఎఫ్ఏ టెస్టులను మాత్రమే నిర్వహించనున్నారు. మొదటి ఎఫ్ఏను మార్చి 15 నాటికి, రెండో ఎఫ్ఏ టెస్టును ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయనున్నారు. సమ్మేటివ్ అసెస్మెంట్ను మే 7 నుంచి 13వ తేదీ మధ్యలో నిర్వహించే అవకాశం ఉంది. విద్యార్థులకు పూర్తిస్థాయి హాజరు శాతం లేకున్నప్పటికీ వార్షిక పరీక్షలకు అనుమతివ్వనున్నారు.
తాజావార్తలు
- జాన్వీ అందాలకు ఫిదా కాని వారు ఉంటారా..!
- పత్తి సాగు విస్తీర్ణంలో సెకండ్ ప్లేస్లో తెలంగాణ
- అంతర్గాలం
- మళ్లీ గ్రే లిస్ట్లోనే పాక్
- నేడు దేశవ్యాప్త బంద్
- శభాష్ నర్సింలు..
- ఒక్క రోజు నెట్ బిల్లు రూ. 4.6 లక్షలు
- జాగ్రత్తతో సైబర్నేరాలకు చెక్: సీపీ సజ్జనార్
- ప్రభుత్వం పారిశ్రామికరంగానికి ప్రోత్సాహం
- అమ్మాయి మా బంధువే.. రూ.90 కోట్ల కట్నమిప్పిస్తాం..