మహబూబ్నగర్ : కరోనా కట్టడికి అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం రాత్రి మంత్రి మహబూబ్ నగర్ లోని కలెక్టర్ కార్యాలయంలో కొవిడ్పై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య, ఇతర సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రెండో విడత కొవిడ్ ఉధృతంగా ఉంది. అయినా జిల్లాలో కొవిడ్ చికిత్సకోసం అన్ని సౌకర్యాలున్నాయి. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఉమ్మడి జిల్లాలో 17, ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోని 7 అంబులెన్స్ లు ఉన్నాయి.
దవాఖానలో ఖాళీ పోస్టులు భర్తీ చేశామన్నారు. ప్రభుత్వ దవాఖాన, మెడికల్ కళాశాలలో బెడ్లు, ఆక్సిజన్ అన్ని సౌకర్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఎస్వీఎస్ మెడికల్ కళాశాల దవాఖానలో కూడా ప్రభుత్వం తరపున కోవిడ్ రోగులకు ఉచిత సేవలు అందించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అక్కడ కూడా 24 గంటలు డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. హాస్పిటల్లో చేరిన కొవిడ్ రోగులకు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. రాత్రి సమయంలో దవాఖానకు వచ్చే రోగులను కూడా వెంటనే చూసి చికిత్స అందించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
కర్నాటక జల దోపిడిపై సీఎం కేసీఆర్కు ఫిర్యాదు
కొత్తూరును కొత్తగా మారుస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు