స్వరూపానందేంద్రస్వామి సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 21న శ్రీరామ నవమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించాలని ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి సూచించారు. ఆలయాల్లో ఉత్సవాలు, గ్రామాల్లో జాతరలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలని ఒక ప్రకటనలో కోరారు. హరిద్వార్ కుంభమేళాలో విశాఖ శారదాపీఠం చేపట్టిన అన్నప్రసాద వితరణను నిలిపివేస్తున్నట్టు తెలిపారు.