మహబూబ్నగర్ : ఆపత్కాలంలో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కొవిడ్ బారినపడి అనేక మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా గొప్పవని ఆయన కొనియాడారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ బాధితులను ఆయన పరామర్శించారు.
వైద్యుల సేవలను కీర్తిస్తూ..వారికి చేతులు ఎత్తి మొక్కారు. ఎంతో సురక్షితమైన ప్రభుత్వ దవాఖానలో వైద్యులు చక్కని చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన పని లేదని రోగులకు మంత్రి ధైర్యం చెప్పారు.
మనో ధైర్యాన్ని మించిన మందు లేదని..ధైర్యంగా ఉన్నప్పుడే మందులు బాగా పనిచేస్తాయని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
లంక టూర్లో టీమిండియా కోచ్గా ద్రవిడ్
ఏరోసోల్స్ 10 మీటర్ల దూరం వ్యాపిస్తాయి…
భారత్కు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం: అమెరికా