కేసీఆర్ దంపతుల పంచలోహ చిత్రపటం అందజేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్ కుమార్తెలు
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేతారకరామారావుకు పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కుమార్తెలు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల పంచలోహ చిత్రపటాన్ని బహూకరించారు. శాంత నారాయణ్గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మంత్రి శ్రీనివాస్గౌడ్ కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షిత మంగళవారం కేటీఆర్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రపటాన్ని బహూకరించారు. ఇద్దరు ప్రముఖ శిల్పులు మూడు నెలలపాటు శ్రమించి అద్భుతమైన పంచలోహ చిత్రపటాన్ని రూపొం దించారని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
పెయింటింగ్ను అందజేసిన ఎంపీ వెంకటేశ్
మంత్రి కేటీఆర్కు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని కేటీఆర్ తైలవర్ణ చిత్రపటాన్ని అందజేశారు. కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రాన్ని గీయించానని ఎంపీ తెలిపారు.