హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): పండిట్ పోస్టులన్నీ పండితులకే దక్కేలా చూస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. అప్గ్రేడేషన్ ప్రక్రియను పూర్తిచేయడంతోపాటు పదోన్నతులు కల్పించేందుకు తనవంతు కృషిచేస్తానని చెప్పారు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ స్టేట్ (ఎస్ఎల్టీఏ టీఎస్), రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు- తెలంగాణ (ఆర్యూపీపీటీ) బాధ్యులు శుక్రవారం ఎమ్మెల్సీ కవితను కలిసి అప్గ్రెడేషన్ సమస్యను పరిష్కరించాలని కోరారు. కవితను కలిసినవారిలో ఆర్యూపీపీటీ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, ఎస్ఎల్టీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్రావు, వీఎస్ఎస్ శర్మ, ఘణపురం దేవేందర్, గంట్యాల ప్రసాద్, జమీలుల్లా తదితరులు ఉన్నారు.