తిరుమల, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యుడిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సోమవారం ప్రమాణం చేశారు. సాయంత్రం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో విద్యాసాగర్ చేత టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకొన్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టువస్త్రంలో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.