హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత మాజీ క్రికెటర్ స్రవంతి నాయుడు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్తో పోరాడిన స్రవంతి తల్లి ఎస్ కే సుమన్ శనివారం తుదిశ్వాస విడిచారు. వెంటిలేటర్పై ఇన్ని రోజులు చికిత్స తీసుకున్న ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లారు. తల్లిని కోల్పోయి తీవ్ర బాధలో ఉన్న స్రవంతికి పలువురు సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలంటూ ఆకాంక్షించారు. స్రవంతికి టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ, జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) చీఫ్ జగన్మోహన్రావు, హెచ్సీఏ ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే.