వరంగల్ : దండకారణ్యంలో కరోనా అలజడి రేపుతోంది. అడవుల్లో ఉండే అన్నలను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. పదుల సంఖ్యంలో మావోయిస్టులు కరోనా బారిన పడ్డారు. దండకారణ్య స్పెషల్ జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్, కొరియర్ బందుగ వినయ్ నిన్న వరంగల్ పోలీసులకు పట్టుబడటంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గడ్డం మధుకర్కు కరోనా సోకడంతో ఆయన చికిత్స నిమిత్తం.. కొరియర్ సాయంతో వరంగల్కు వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ములుగు క్రాస్ రోడ్డు వద్ద మధుకర్తో పాటు వినయ్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కరోనా బారిన పడ్డ మావోయిస్టులకు కొవిడ్ చికిత్స చేయించుకునేందుకు అగ్ర నాయకులు అనుమతి ఇవ్వడం లేదని మధుకర్ తెలిపాడు. మొత్తంగా కరోనాతో 12 మంది మావోయిస్టులు కరోనాతో పోరాటం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
గత పదిరోజుల క్రితం బీజాపూర్ సిల్దూర్ గ్రామం వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపును వ్యతిరేకిస్తూ ఛత్తీస్గడ్, తెలంగాణ రాష్ర్ట సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలతో మావోయిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సమయంలో కొవిడ్ లక్షణాలున్న ప్రజలను మావోయిస్టు నాయకులు, సభ్యులు కలవడంతో వారికి కరోనా సోకినట్లు తేలింది.