లండన్ : మొబైల్ ఫోన్ స్క్రీన్స్ నుంచి సేకరించిన స్వాబ్ నమూనాతో కచ్చితత్వంతో, తక్కువ వ్యయంతో కొవిడ్-19 నిర్ధారణ పరీక్షను బ్రిటన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.ముక్కు నుంచి సేకరించిన స్వాబ్ నమూనాలను పరీక్షించడం ద్వారా కొవిడ్-19 పాజిటివ్గా తేలిన రోగుల మొబైల్ ఫోన్ స్క్రీన్ స్వాబ్ నమూనాలను పరీక్షించినా పాజిటివ్గా వచ్చినట్టు యూనివర్సిటీ కాలేజ్ లండన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం గుర్తించింది.
తాజా పరీక్షా పద్ధతిని ఫోన్ స్క్రీన్ టెస్టింగ్ (పోస్ట్)గా వ్యవహరిస్తారు. పోస్ట్ పరీక్షను క్లినికల్ టెస్ట్గా కాకుండా పర్యావరణ పరీక్షగా పరిగణిస్తారని పరిశోధకులు పేర్కొన్నారు. ముక్కుద్వారా సేకరించే నమూనాలను పరీక్షించే పీసీఆర్ పరీక్షతో పోలిస్తే పోస్ట్ టెస్ట్ను సులువుగా తక్కువ వ్యయంతో చేపట్టవచ్చని తెలిపారు. ఫోన్ ద్వారా నమూనాలను నిమిషంలో సేకరించవచ్చని, దీనికి వైద్య సిబ్బంది ప్రమేయం అవసరం లేదని పేర్కొన్నారు. అతితక్కువ ఖర్చుతో పెద్దసంఖ్యలో పోస్ట్ టెస్ట్లను నిర్వహించవచ్చని డయాగ్నసిస్ బయోటెక్లో పరిశోధకుడు, యూసీఎల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్త్మాలజీకి చెందిన రొడ్రిగొ యంగ్ తెలిపారు.