హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే. తారకరామారావు జన్మదినం ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఆధ్వర్యంలో రూపొందించిన “కదిలే కదిలే…” ప్రత్యేక గీతాన్ని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ శుక్రవారం ఆవిష్కరించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక గీతాన్ని రూపొందించిన దూలం సత్యనారాయణ, సంగీత దర్శకుడు కార్తీక్ కొడకండ్ల, గీత రచయిత వీరు గడ్డం, ఇతర బృంద సభ్యులను ఎంపీ అభినందించారు.