యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం విశేష పూజలు వైభవంగా నిర్వ హించారు. బాలాలయం లో కవచమూర్తలను సువర్ణపుష్పాలతో అర్చించిన అర్చకులు మండపంలో ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి అర్చనలు చేపట్టారు. అనంతరం సుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా చేపట్టారు. సోమవారం కావడంతో శివుడికి రుద్రాబిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ప్రభాతవేళలో మొదటగా గంటన్నరపాటు శివుడ్నికొలుస్తూ జరిగిన రుద్రాబిషస్త్రకంలో భక్తులు మమేకమయ్యారు. ఉద యాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడ్ని విభూ తితో ఆలంకరించారు. కొండకింద గోశాల వద్ద గల వ్రత మండపంలో భక్తులు సత్యనారాయణ వ్రతమాచరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే క్యూలు కట్టారు. దర్శనం అనంతరం ప్రీతికరమైన స్వామివారి లడ్డూ ప్రసాదం కొనుగోలు చేశారు.