మోటకొండూరు, జూలై 29: దళిత బంధు పథకాన్ని అడ్డుకునే ప్ర యత్నం సిగ్గుచేటు అని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ దళితులను గుండెల్లో పెట్టుకుని, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని చెప్పారు. దళిత బంధు ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గురువారం ఆయన యా దాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే దళితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్గా చరిత్రలో నిలిచిపోతారని కితాబిచ్చారు. దళిత బంధు విజయానికి పాదయాత్ర లేదా సైకిల్యా త్ర చే పడతామని వెల్లడించారు. దళితులు అభివృద్ధి చెందకుండా కొంతమంది నాయకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దళిత బంధులో భా గంగా గురుకుల విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని, పీజీ పూర్తిచేసిన విద్యార్థులకు స్వయంఉపాధి కల్పించాలని కోరారు. సమావేశంలో ఎంవైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్టపెంజర రమేశ్, చిలకమారి గణేశ్ పాల్గొన్నారు.