స్కూల్గ్రాంట్ నుంచి 10% కేటాయింపు
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది చేతులు శుభ్రం చేసుకొనేందుకు అవసరమైన సబ్బులు, లిక్విడ్ కొనుగోలుకోసం స్కూల్గ్రాం ట్ నిధుల నుంచి 10శాతం కేటాయించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సమగ్రశిక్షా అభియాన్ అధికారులు వార్షిక కాంపోజిట్ గ్రాంట్ నిధులను మంజూరుచేశారు. ఎన్రోల్మెంట్ స్లాబుల ఆధారంగా నిధులు కేటాయించారు. పరిశుభ్రతతోపాటు స్వచ్ఛత యాక్షన్ప్లాన్లో భాగంగా టాయ్లెట్ల వద్ద సబ్బులు, లిక్విడ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1-15 మంది విద్యార్థులకు రూ.12,500, 16- 100 మంది విద్యార్థులకు రూ.25వేలు, 101 -250 మంది వరకు రూ.50వేలు, 251-1,000 మంది వరకు 75వేలు, వె య్యిమందికి మించి విద్యార్థులున్న స్కూళ్లకు రూ.లక్ష చొప్పున నిధులను కేటాయించారు. ఈ నిధులను స్టేషనరీ, చాక్పీస్లు, రిజిస్టర్లు, పేపర్లు, పరీక్షలు, జాతీయ పండుగల నిర్వహణ, విద్యుత్తు, ఇంటర్నెట్ చార్జీలు, మరమ్మతులకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు.