న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మావోయిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 24 మంది జవాన్లు వీర మరణం పొందడాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకున్నది. ఎలాగైనా ఆ ఘటనకు దీటైన జవాబిచ్చి తీరాలని నిర్ణయించింది. మావోయిస్టు బెటాలియన్ కమాండర్ హిడ్మా ఉన్నట్లుగా ఉప్పందించి భద్రతా బలగాలను మావోయిస్టులు ట్రాప్ చేసినందువల్ల.. ఇప్పడు భద్రతా బలగాలు అదే హిడ్మాను టార్గెట్ చేస్తూ ఓ కొత్త ఆపరేషన్కు సన్నద్ధమయ్యాయి.
హిడ్మాతోపాటు మరో 8 మంది మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా ‘ఆపరేషన్ ప్రహర్-3’ చేపట్టాయి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్షా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ఇంటెలిజెన్స్ అధికారులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
దాంతో కేంద్ర భద్రతాబలగాలు ‘మోస్ట్వాంటెడ్’ జాబితాను రూపొందించాయి. అందులో మావోయిస్టు టాప్ కమాండర్తోపాటు మరో ఎనిమిది మంది కీలక కమాండర్ల పేర్లను పొందుపర్చాయి. అదేవిధంగా యువతను నక్సలిజం వైపు మళ్లిస్తున్న వ్యక్తులను కూడా గుర్తించాలని కేంద్ర హోంశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: మావోయిస్టుల చెరలో జవాన్ రాకేశ్వర్సింగ్
ఎల్జీ కంపెనీ సంచలన నిర్ణయం..!
స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా తగ్గిన వెండి
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
టీకా వేయించుకుంటే ముక్కుపుల్ల ఉచితం..!
మధుమేహం ఉన్నవారు కార్న్ఫ్లేక్స్ తినొచ్చా..?