న్యూఢిల్లీ: వేగంగా సమాజంలో వ్యాప్తిస్తున్న కరోనాతోపాటు ప్రజలను భయపెట్టే రీతిలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడానికి కారణాలపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుడు డాక్టర్ పీ శరత్ చంద్ర కుండబద్దలు కొట్టారు. గతంలో ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని ఎయిమ్స్ న్యూరో సర్జరీ ప్రొఫెసర్ శరత్ చంద్ర పేర్కొన్నారు.
అదుపులో లేని మధుమేహం వ్యాధి వల్ల కూడా మూకోమైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ స్ప్రెడ్ అవుతున్నదని చెప్పారు. ఒకవైపు ఆక్సిజన్ తీసుకుంటూ కరోనా చికిత్సలో భాగంగా టోసిలిజుమాబ్ వంటి స్టెరాయిడ్స్ వాడటం మరో కారణం అన్నారు. ఆరు వారాల్లో కరోనా చికిత్స పొందిన రోగులకు బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అయ్యే ముప్పు పొంచి ఉందన్నారు.
అలాగే రోగుల ప్రాణాలను కాపాడేందుకు సిలిండర్ నుంచి శీతల ఆక్సిజన్ అందించడం చాలా ప్రమాదకరం అని డాక్టర్ శరత్ చంద్ర స్పష్టం చేశారు. ఒకే మాస్క్ 2-3 వారాలు వాడటం కూడా బ్లాక్ ఫంగస్ అభివ్రుద్ధి కావడానికి మరో కారణం అని చెప్పారు.
బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గిపోవాలంటే యాంటీ ఫంగల్ డ్రగ్ పొసాకోనాజోల్ ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు ఉండొచ్చునన్నారు. ప్రత్యేకించి బ్లాక్ ఫంగస్ హై రిస్క్ కేసుల్లో ప్రమాదం తగ్గించొచ్చునన్నారు.
ఎపిడమిక్ ప్రపోర్షన్లు ఎందుకు పెరుగుతున్నాయో అర్ధం కావడం లేదన్నారు డాక్టర్ శరత్ చంద్ర. దీని వ్యాప్తికి బహుళ కారణాలు ఉండొచ్చునని అంచనా వేశారు. పలు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతుండటంతో అల్లాడిపోతున్నాయి.
రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేశాయి. దీని ప్రకారం ప్రతి బ్లాక్ ఫంగస్ కేసును రాష్ట్ర ప్రభుత్వానికి దవాఖానలు నివేదించాల్సి ఉంటుంది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఆకాశానికెత్తారు.. ఆపై పడదోశారు.. ఎందుకు?
వ్యాక్సినేషన్ వ్యయం రూ 3.7 లక్షల కోట్లు : ఎస్బీఐ
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. రేపు డిజిటల్ సేవలకు దూరం ఎందుకంటే..!
జంట సవాళ్లు.. బెంగాల్లో 16 జూట్ మిల్లుల మూసివేత!
ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఏకంగా సీఎంకే ట్వీట్
పెళ్లికొచ్చిన అతిథులతో కప్ప గంతులు.. వీడియో వైరల్
లాక్డౌన్తో నిత్యావసరాలు కుదేలు.. ఉత్పత్తి తగ్గించిన ఎఫ్ఎంసీజీ సంస్థలు
చంటి బిడ్డలకు తల్లిపాలే కరోనాకు మందు