రూ.98 కోట్లతో మిషన్ భగీరథ మదర్ ట్యాంక్ నిర్మాణం
పట్టణ ప్రజలకు నిత్యం నీటి సరఫరా
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 11 : ఇంటింటికీ సురక్షితమైన నీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారన్నారు. పట్టణంలోని ఫిల్డర్బెడ్లో రూ.98 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ మదర్ ట్యాంక్ నుంచి ఆదివారం పట్టణంలోని 11 ట్యాంకులకు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని 36 వార్డులకు ఈ ట్యాంక్ ద్వారా నీరు సరఫరా అవుతుందన్నారు. ఇందులో 20 లక్షల లీటర్ల నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉందని, పట్టణ ప్రజలకు నిత్యం సరఫరా చేసే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. గతంలో అనేక కాలనీల్లో నీటి సమస్య ఉం డేదని, కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తున్నామన్నారు. పట్ట ణ జనాభా ప్రకారం నిత్యం 2.20 కోట్ల లీటర్ల నీ రు అవసరమవుతుందని, 2048 వరకు జనాభా ఎంత పెరిగినా ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేసేందుకు ట్యాంకులు నిర్మించినట్లు చెప్పా రు. మున్సిపాలిటీలో విలీనమైన కాలనీలకు దేవాపూర్ ట్యాంక్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, ప్రకాశ్, బండారి సతీ శ్, అశోక్స్వామి, నాయకులు దమ్మపాల్, కొండ గణేశ్, శ్రీనివాస్, శైలేందర్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు భూమి పూజ..
పట్టణంలోని 28, 29వ వార్డుల్లో షాదీఖానా, బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే జోగు రామన్న భూ మి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. వచ్చే ఆరునెలల్లో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టణాభివృద్ధిపై దృష్టిపెట్టిందని తెలిపారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి నిధులు తీసుకవచ్చి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. 28, 29వ వార్డుల్లో రూ.1.50 కోట్లతో బీటీ రోడ్డు, షాదీఖానా నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గ్రీన్బడ్జెట్ ద్వారా భారీగా మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కౌన్సిలర్లు సంద నర్సింగ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.