పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లిలో వ్యవసాయ బావిలో పడి దాడి లక్ష్మి (65) అనే వృద్ధురాలు మృతి చెందింది. మృతురాలు ధర్మారంలో జెర్సీ పాల దుకాణం నిర్వహిస్తున్న దాడి ఐలయ్య తల్లిగా గుర్తించారు. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు
భారత్కు చేరిన అమెరికా అత్యవసర సాయం