హైదరాబాద్ : శాసనసభలో సీనియర్ ఫోటోగ్రాఫర్ సలీం ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ స్పందిస్తూ.. శాసనసభ ప్రాంగణంలో వాహనం దిగినప్పటి నుంచి ఫోటోలు తీస్తూ తిరిగి వెళ్ళేంతవరకు అన్ని సంఘటనలను కవర్ చేస్తూ స్పీకర్ సాబ్ స్పీకర్ సాబ్ అంటూ ఉండే సలీం కరోనాతో చనిపోవడం తనని కలిచివేసిందన్నారు. సలీం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సభాపతి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.