తెలంగాణ వచ్చాకే మంచి రోజులు
మీ సహకారం ఉంటే మరింత ముందుకు..
టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికే ఓటేయాలి : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి, మార్చి 12 : గత ప్రభుత్వాల హయాంలో మ రుగునపడిన అంగన్వాడీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం కేసీఆరేనని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీలకు రూ.7,500 నుంచి రూ.10,500లకు జీతాన్ని పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలోని 70 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు స ర్కారు అండగా నిలిచిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించామని గుర్తు చేశారు. 60 ఏండ్లలో ఏర్పడిన చిక్కుముళ్లను విప్పుతున్నాని, గ్రామాల్లో మీ సేవలు మరువలేనివని అన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని కొనియాడారు. మీ సహకారం, ఆశీస్సులు ఉంటే మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతామన్నారు. సీఎం కేసీఆర్ హయాం లో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలవు తున్నాయన్నారు. రాష్ట్రంలో 1.32 లక్షల ఉద్యోగాలు క ల్పించామని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు ఆశించిన స్థాయిలో పీఆర్సీ ఉం టుందన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్ద న్నారు. వారు ఓట్ల సమయంలో మాత్రమే ప్రజల వద్ద కు వస్తారని, వారిని ఎవరూ నమ్మడం లేదన్నారు. అంగన్వాడీ పట్టభద్రులందరూ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటేసి ఆశ్వీరదించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్కుమార్, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.