నిర్మల్ : అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 2019లో ఒగ్గు సట్వాజి, అతని భార్య ఇద్దరూ డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. దీంతో వారిపై ఉన్న క్యాష్ రివార్డు, ఇంటి స్థలాన్ని ఇదివరకే అందజేశారు. ప్రస్తుతం ఎస్పీ చొరవతో ప్రభుత్వ హామీ మేరకు వారికి కేటాయించిన ఐదెకరాల భూమి, పట్టా పాస్బుక్ పత్రాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం ఎస్పీ అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బూజుపట్టిన సిద్ధాంతాలను వదిలి మావోయిస్టులు ఎవరు వచ్చినా చేరదీయడానికి ప్రభుత్వం ముందుందన్నారు. అభివృద్ధి పలాలు మారుమూల గ్రామాల్లోని ప్రతి పల్లెకూ చేరుతునాయని గుర్తు చేశారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టుల మాదిరిగానే మిగతా వారూ లొంగిపోతే వారిపై ఉన్న రివార్డులు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అన్ని బెనిఫిట్స్ అందజేయడానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమేశ్, నిర్మల్ రూరల్ సీఐ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ తగాదాలతో తండ్రీ, కొడుకుల దారుణ హత్య
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా