హైదరాబాద్ : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ కోసం ఊరెళ్లిన వారి కోసం రెండు రోజుల పాటు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రత్యేకంగా 12 అన్ రిజర్వుడ్ రైళ్లు నడిపిస్తున్నట్టు తెలిపింది. సికింద్రాబాద్- కాజీపేట, కాజీపేట-భద్రాచలం, భద్రాచలం-కాజీపేట, కాజీపేట-హైదరాబాద్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్, సికింద్రాబాద్ -విజయవాడ, విజయవాడ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – నిజామాబాద్, నిజామాబాద్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. కాచిగూడ-కర్నూలు సిటీ, కర్నూలు సిటీ -కాచిగూడ మధ్య రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. దసరా పండుగ నేపథ్యంలో పెద్ద జనం స్వస్థలాలకు వెళ్లిన విషయం తెలిసిందే. తిరిగి వచ్చే సమయంలో ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది.