సికింద్రాబాద్ : దాదాపు 16 నెలల తర్వాత సాధారణ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే 82 రైళ్లను పునరుద్దరించింది. వీటిలో 16 రైళ్లు ఎక్స్ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ప్యాసింజర్ రైలులో ప్రయాణానికి స్టేషన్లోనే టికెట్లు ఇవ్వనున్నారు. రైళ్లలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. స్టేషన్లు, రైళ్లలో కొవిడ్ ప్రొటోకాల్ కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు.