ఎల్బీనగర్, మే 19: భారత ఆన్లైన్ అబాకస్ కాంపిటీషన్ నేషనల్ ప్రోడిజీ -2021లో తెలంగాణ విద్యార్థులు సత్తా చా టారు. దేశంలోని 20 రాష్ర్టాలు నుంచి 27 వేలమంది విద్యార్థులు పోటీపడ్డారు. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన దేవులపల్లి సౌరవ్ 17 మంది చాంపియన్లలో ఒకడిగా నిలిచాడు. అద్వితి, అన్విత, కీర్తన్, మినతి, తమన్, కుషాల్ రన్నరప్లుగా నిలిచారు.