నంగునూరు, ఏప్రిల్ 19 : కరోనా నివారణ టీకాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని, దానికి తగ్గట్టుగా సిబ్బందిని సమకూర్చి మరిన్ని సెంటర్లు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని వైద్యసిబ్బందితోపాటు కలెక్టర్ వెంకట్రామ్రెడ్డిని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. సోమవారం సిద్దిపేట జిల్లా రాజగోపాల్పేట పీహెచ్సీని మంత్రి ఆకస్మికంగా తనిఖీచేశారు. టీకా కోసం వచ్చిన వారితో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. టీకా వేయడంలో జాప్యం జరుగుతుందని పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. జాప్యంపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ వెంకట్రామ్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. వ్యాక్సిన్ కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, సెంటర్ల వద్ద సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచి సజావుగా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు.