పెద్దపల్లి: జిల్లాలోని జూలపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని కొడుకు చేతిలో ఓ తండ్రి హత్యకు గురయ్యాడు. జూలపల్లి మండలంలోని అబ్బాపూర్కు చెందిన లచ్చయ్య, మహేశ్ తండ్రీకొడుకులు. కొంతకాలం క్రితం మహేశ్ మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మహేశ్.. తండ్రి లచ్చయ్యను రోకలిబండతో కొట్టి హత్యచేశాడు. కాగా, ఈ హత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి