నిజామాబాద్ సిటీ, ఆగస్టు 5 : వేధింపులు భరించలేక తండ్రి కొడుకును హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీనగర్ ప్రాంతానికి చెందిన ఏలుగం ప్రవీణ్ ప్రతి రోజూ తప్పతాగి వచ్చి ఇంట్లో నానా హంగామా చేసేవాడు. తండ్రి రమేశ్ ఎన్నిసార్లు మందలించినా పట్టించుకునేవాడు కాదు.
బుధవారం రాత్రి సైతం మద్యం తాగి వచ్చిన ప్రవీణ్ తండ్రితో గొడవకు దిగాడు. దీంతో విసిగిపోయిన రమేశ్ అర్ధరాత్రి ప్రవీణ్ నిద్రిస్తున్న సమయంలో తలపై కత్తితో దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం రమేశ్ పోలీస్స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్సై సాయినాథ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్ మృతదేహన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రమేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.