మంత్రి హరీశ్రావుకు ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి వినతి
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): మాదిగల డిమాండ్లను పరిషరించి, సముచిత స్థానం కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. శుక్రవారం ఆర్థిక మంత్రి హరీశ్రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. తన జన్మదినం సందర్భంగా మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వంగపల్లి.. సమస్యల పరిష్కారానికి పెద్దన్నపాత్ర పోషించాలని కోరారు. డప్పుకు-చెప్పుకు పెన్షన్తోపాటు బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.